దేవుడు చేతిలో మనుషుల జీవితం కీలుబొమ్మ లాంటిది అని చెబుతూ ఉంటారు.కారణం ఒక ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాము అని ఆనందపడే లోపే మృత్యువు మరో రూపంలో దరి చేరుతుంది.
తాజాగా చైనాలో నెలకొన్న పరిస్థితి చూస్తే అది నిజమే అనిపిస్తుంది.కరోనా వైరస్ మొదట చైనాలోనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే… కేవలం వెలుగులోకి రావడమే కాదు ఈ వైరస్ను గుర్తించే సరికే… చాప కింద నీరులా దేశం మొత్తం పాకిపోయింది.
దీంతో కరోనా వైరస్ బారిన పడి ఎంతో మంది మృతి ఒడిలోకి చేరారు.
ఏకంగా కరోనా కారణంగా వేల ప్రాణ నష్టం సంభవించింది.
అయితే చైనాలో ఇప్పుడిప్పుడే ఈ కరోనా మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది.అయితే చైనాలో కాస్త కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుంది అని అక్కడి ప్రజలందరూ ఆనంద పడుతున్న నేపథ్యంలో… మృత్యువు మరో రూపంలో దరిచేరింది.
చైనాలో గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అక్కడి ప్రజలందరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
దీంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి.
దీంతో కరోనా నుంచి కోలుకున్నామని ఆనంద పడుతున్న ప్రజానీకం మొత్తం వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు.వరదల కారణంగా చైనాలో భారీగా ప్రాణ నష్టం సంభవిస్తుంది.
ఇటీవలే చైనాలో కురిసిన వర్షానికి యాంగ్జి నది ఉప్పొంగడంతో… వచ్చిన వరదల కారణంగా ఏకంగా ఇప్పటివరకు చైనాలో 141 మంది ప్రాణాలు కోల్పోయారు.అంతేకాకుండా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.