ఇకపై రైల్ లో టికెట్ లేని ప్రయాణం చేస్తే జైలు శిక్ష నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది.ముఖ్యంగా టిక్కెట్ లేని ప్రయాణాలు, ఫుట్ బోర్డింగ్ చేయడం లాంటి చిన్న చిన్న నేరాలకు ఇంత కాలం విధిస్తున్న జైలు శిక్షను పూర్తిగా రద్దు చేసేందుకు రైల్వే శాఖ ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
ఇక మొదట ఈ విషయాలలో కేవలం జరిమానాలతోనే సరి పెడదామని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఇందులో ప్రజలకు, అటు కోర్టులకు ఇద్దరికీ భారం తగ్గించేందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతోంది.
ఇకపోతే రైల్వే స్టేషన్ పరిధిలో భిక్షాటన చేయడాన్ని నేరంగా పరిగణించే కూడదని అనే ప్రతిపాదన కూడా రైల్వేశాఖ ముందు పరిశీలనకు వచ్చింది. రైల్వే చట్టంలోని కొన్ని నిబంధనలకు ఆ శాఖ సంరక్షిస్తుందని దానికి కారణం కోర్ట్ లపై భారం తగ్గించడంతో పాటు పౌరుల సౌకర్యార్థం చిన్నచిన్న నేరాలకు కేవలం జరిమానాలు విధించి అనువైన పరిస్థితులు కల్పించేందుకు రైలు శాఖ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ విషయం వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి ఈ విషయాన్ని తెలియజేశారు.ఇకపై ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం రైలు లోపల, రైల్వే స్టేషన్ లో జరిగే కొన్ని నేరాలకు జరిమానా అలాగే జైలు శిక్ష విధించే అవకాశం ఉండేది.
ఇక తాజా ప్రతిపాదనకు రైల్వే శాఖ అంగీకరిస్తే రైల్లో అనవసరంగా టికెట్ తీసుకోకుండా ప్రయాణించే లాంటి మొదలగు వాటి నెలలు జైలు శిక్ష లేకుండా కేవలం ఆ కేసులు పరిష్కారం కాబోతున్నాయి
.