అసలే కరోనా వల్ల చేతిలో డబ్బులు లేకుండా ప్రజలు అవస్దలు పడుతుంటే ప్రభుత్వాలు మాత్రం ధరలకు రెక్కలు కట్టి వదులుతున్నాయి.ప్రస్తుతం ఒక మధ్యతరగతి మనిషి బ్రతకాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొనే పరిస్దితులు సమాజంలో నెలకొన్నాయి.
ఈ కరోనా కష్టకాలంలో పెరగని వస్తువు రేటు అంటూ లేదు.ఈ నేపధ్యంలో సికింద్రాబాద్రైల్వే స్టేషన్ కూడా ప్రయాణికులు షాకయ్యే నిర్ణయాన్ని తీసుకుంది.తాజాగా ప్లాట్ఫాం టికెట్ ధరను పెంచుతూ ఉన్నట్లుగా వెల్లడించింది.
కాగా ఇప్పటి వరకూ ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.30 ఉండగా, రూ 20 పెంచి రూ.50కి రౌండ్ ఫిగర్ చేశారు.అయితే పెరిగిన ఈ ప్లాట్ఫాం టికెట్ ధర రేపటి నుంచే అమల్లోకి వస్తుందని రైల్వేశాఖ వెల్లడించింది.ఈమేరకు రైల్వేశాఖ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌత్సెంట్రల్ రైల్వే సోమవారం ప్రకటించింది.
ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్రైల్వే సీపీఆర్ఓ రాకేష్ మాట్లాడుతూ, కొవిడ్ నిబంధనల్లో భాగంగా రైల్వే స్టేషన్లో రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడం ఆశ్చర్యకరం.