భారత ప్రధాని నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా మాట్లాడుతుండగా,పాకిస్థాన్ మంత్రికి కరెంట్ షాక్ తగిలింది.జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడం తో పాకిస్థాన్ నానా యాగీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పాక్ లోని ఇస్లామాబాద్ లో ఒక ర్యాలీ ని నిర్వహించగా, ఈ ర్యాలీ కోసం అని పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్న సమయంలో ఒక్కసారి గా ఆయనకు కరెంట్ షాక్ తగిలింది.
మైక్ ద్వారా ఆయనకు కరెంట్ షాక్ తగలడంతో.వెంటనే స్పందిస్తూ.
ఇది విద్యుదాఘాతం అనుకుంటాను.మోదీ మనల్ని ఎప్పటికీ ఏం చేయలేడు అని షేక్ రషీద్ అహ్మద్ పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్తో పాకిస్థాన్ దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచేసుకున్న విషయం విదితమే.పాకిస్థాన్, భారత్ మధ్య అక్టోబర్లో యుద్ధం జరుగొచ్చని ఇటీవల రైల్వే మంత్రి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
మరోవైపు భారత్ను ఇరుకున పెట్టేందుకు కరాచీ మీదుగా విమానాల రాకపోకలపై కూడా పాక్ నిషేధం విధించి భారత్ ను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తుంది.