మళ్లీ బుకింగ్స్‌ను నిలిపేసిన రైల్వే

లాక్‌డౌన్‌ ఈనెల 14న

ముగియబోతున్న నేపథ్యంలో రైల్వే శాఖ తాజాగా ఏప్రిల్‌ 15 నుండి ప్రయాణాలకు అడ్వాన్స్‌ బుకింగ్‌లను మొదలు పెట్టిన విషయం తెల్సిందే.పలు విమానయాన సంస్థలు ఇంకా రైల్వే కూడా అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభం చేసిన నేపథ్యంలో లాక్‌ డౌన్‌ను ఎత్తి వేసే అవకాశం ఉందని అంతా భావించారు.

 Railway Deportment Stop The Bookings, Corona Virus, India, Lock Down,  April 15t-TeluguStop.com

కాని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంకా కేంద్రంలోని మంత్రులు కూడా కొందరు లాక్‌ డౌన్‌పై ఇంకొన్ని రోజులు వేచి చూడాలనే ఉద్దేశ్యంతో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా లాక్‌ డౌన్‌ను కొనసాగించే ఉద్దేశ్యంలో ఉందనే వార్తలు వస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఒక వేళ లాక్‌ డౌన్‌ను ఎత్తివేయకున్నా కూడా సగానికి పైగా రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అందుకే దేశ వ్యాప్తంగా మొదలైన రైల్వే బుకింగ్స్‌ను మళ్లీ నిలిపేసినట్లుగా తెలుస్తోంది.గత రెండు మూడు రోజులుగా బుకింగ్స్‌ చేసుకున్న వారికి వారి టికెట్లను క్యాన్సిల్‌ చేసుకుంటే అమౌంట్‌ రిటర్న్‌ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

పరిస్థితులు చూస్తుంటే ఈ నెల చివరి వరకు కూడా లాక్‌ డౌన్‌ కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు లేదంటే కేంద్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌పై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube