లాక్ డౌన్ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ హవా ఎక్కువ అయ్యింది.ఎక్కువ మంది వెబ్ సిరీస్ ల మీద దృష్టి పెడుతున్నారు.
థియేటర్లు లేకపోవడం ఇంట్లో ఉన్న ప్రజలు వెబ్ సిరీస్ లు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపించారు.ఇక వెబ్ సిరీస్ లకి డిమాండ్ పెరగడంతో ఇప్పుడు దర్శకులు, నిర్మాతలు అందరూ వెబ్ సిరీస్ ల మీద దృష్టి పెట్టారు.
ఒటీటీ సంస్థలు కూడా వెబ్ సిరీస్ ల కోసం భారీ మొత్తంలో డబ్బులు వెచ్చిస్తున్నాయి.ఇక భవిష్యత్తు అంత వెబ్ సిరీస్ ల హవానే నడుస్తుంది అనే టాక్ ఇప్పటి నుంచే వినిపిస్తుంది.
అలాగే సినిమాలు కూడా నేరుగా ఓటీటీ ద్వారా రిలీజ్ చేసుకోవాల్సిందే అనే మాట కూడా వినిపిస్తుంది.ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజ్ అవుతున్నాయి.
ఈ వెబ్ సిరీస్ లు తెలుగులోనూ బాగా పెరుగుతున్నాయి.తాజాగా యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన రాహుల్ చిలసౌ సినిమాతో దర్శకుడిగా మారి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఈ సినిమాకి స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నాడు.
తరువాత నాగార్జునతో తెరకెక్కించిన మన్మధుడు 2 డిజాస్టర్ అయ్యింది.ఇప్పుడు సినిమాలకి గ్యాప్ తీసుకొని వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో ఉన్నాడు.
వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నెట్ ఫ్లిక్స్ సంస్థలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది.దీనికి సంబంధించిన వివరాలు ఇంకా బయటకి వెల్లడి కావాల్సి ఉంది.