చిలసౌ చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్. హీరోగా పలు చిత్రాల్లో నటించినా కూడా పెద్దగా స్టార్డం రాకపోవడంతో దర్శకుడిగా ఈయన మారిన విషయం తెల్సిందే.
మొదటి సినిమా హిట్ అవ్వడంతో వెంటనే నాగార్జునను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు.మన్మధుడు 2 చిత్రం సక్సెస్ అయితే వరుసగా ఈ యువ దర్శకుడు సినిమాలు చేసేవాడు.
కాని మన్మధుడు ఫ్లాప్ అయ్యింది. మన్మధుడు 2 చిత్రం ఫ్లాప్తో మళ్లీ అవకాశాలు వస్తాయనే నమ్మకం లేకుండా పోయింది.
ఇద్దరు ముగ్గురు హీరోలతో సంప్రదింపులు జరిపినా కూడా మన్మధుడు 2 ఫలితం నేపథ్యంలో వారు భయపడుతున్నారు.అందుకే ఆయనతో సినిమాలు చేసేందుకు ఏ హీరో కూడా ఆసక్తి చూపడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఈ సమయంలోనే ఈయన కొత్తగా వెబ్ సిరీస్లపై దృష్టి పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
వెబ్ సిరీస్లు కూడా ఈమద్య కాలంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
అందుకే వెబ్ సిరీస్ ద్వారా తన సత్తాను చాటుకుని మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే నిర్ణయానికి రాహుల్ రవీంద్రన్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం ఈయన ఒక వెబ్ సిరీస్ను రూపొందించేందుకు స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట.
తెలుగు మరియు తమిళంలో ఆ వెబ్ సిరీస్ ఉంటుందని సమాచారం అందుతోంది.మరి వెబ్ సిరీస్తో అయినా ఈయన దర్శకుడిగా హిట్ అయ్యేనా చూడాలి.