దేశంలో గాని, రాష్ట్రంలో గానీ కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడినట్లుగా ఉందని కొందరు అనుమానిస్తున్నారట.ఎందుకంటే కాంగ్రెస్ నేతల్లో ఐఖ్యత లేదని ఇప్పటికే అన్ని చోట్ల గుసగుసలు ప్రచారంలో ఉండగా హస్తం నాయకులు కూడా అలాగే ప్రవర్తించడం ఈ వార్తలకు ఊపిరిపోసినట్లుగా ఉందనుకుంటున్నారట.
రాహుల్ గాంధీ గువాహటిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించారట.
ఈ రోజు ఉదయం గువాహటిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించుకున్న రాహూల్ అమ్మవారికి పూజలు చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ఓటర్లకు ముఖ్యంగా ఐదు హామీలు ఇచ్చిందని, తాము అధికారంలోకి వస్తే సీఏఏను అమలు చేయబోమని వెల్లడించారట.,/br.
అలాగే రాష్ట్రంలో తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులకు రోజుకి కనీస వేతనంగా రూ.365 నిర్ణయిస్తామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇస్తామని కూడా పేర్కొన్నారు.మరి ఓటర్లను ఆకర్శించడానికి, భగవంతుని అనుగ్రహం పొందడానికి రాహూల్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించి త్వరలోనే అధికార పీఠాన్ని దక్కించుకుంటాడా లేడా చూడాలనుకుంటున్నారట కొందరు.