ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసినా తప్పు పట్టడం కాంగ్రెస్ కు అలవాటే.అయితే కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం పంజాబ్ లో ఆందోళన చేపట్టారు.
ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.అయితే ర్యాలీలో రాహుల్ గాంధీ కూర్చున్న ట్రాక్టర్ పై రెక్లైనర్ సోఫా ను అమర్చి రైతు మనోభావాలని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.నిజంగా రైతుల సమస్యలపై పోరాటం చేయాలి అని అనుకుంటే ఇలా ట్రాక్టర్ పై సోఫా అమర్చేవాడు కాదని, రైతులను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్విటర్ వేదికగా రాహుల్ను విమర్శించారు.‘కాంగ్రెస్ ప్రారంభించిన నిరసన పూర్తిగా రాజకీయ ఆందోళనే.నూతన వ్యవసాయ చట్టంతో కొందరి స్వార్థ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి.వారే ఈ నిరసన చేస్తున్నారు’ అని హర్దీప్ సింగ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.ఇలా ట్రాక్టర్లపై సోఫాలు వేసుకోవడం నిరసన అనిపించుకోదని రాహుల్ను ఎద్దేవా చేశారు.ఇది రైతులను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ‘ఆందోళనని’ అని హర్దీప్ సింగ్ దుయ్యబట్టారు.
మరి దీనికి రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తాడో చూడాలి.