ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.చైనాలో మొదలైన ఈ విధ్వంసం ఆ తరువాత ఒక్కొక్క దేశానికి విస్తరిస్తూ ప్రస్తుతం భారత్ లో తన ప్రభావం చూపిస్తుంది.
ఇప్పటికే కరోనా దెబ్బకి ఇండియా గజగజవణికిపోతుంది.దీనికి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో దేశంలో కరోనా ను అరికట్టడం ఎవరితరం కావడంలేదు.
లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పుడు కరోనా కంట్రోల్ లోనే ఉన్నప్పటికీ , ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపిస్తుందనే కారణంతో లాక్ డౌన్ నుండి కొద్దికొద్దిగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు.దీనితో పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి.
ప్రస్తుతం దేశంలో 77 లక్షలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.వ్యాక్సిన్ వచ్చే వరకు ఇండియా లో కరోనా వ్యాప్తి తగ్గేలాలేదు.
ఇదిలా ఉంటే , కరోనా మహమ్మారిని అదునుగా భావించిన విపక్షాలు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి.కరోనా కారణంగా భారత్ ఆర్థిక వ్యవస్థ 2020లో 10.3శాతం క్షీణిస్తుందని ఐఎంఎఫ్ తాజా నివేదికలో అంచనావేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.
ఇది మోదీ సాధించిన భారీ విజయం అంటూ ఎద్దేవా చేశారు.అలానే కరోనా కట్టడిలో పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ వంటి దేశాలు భారత్ కంటే ఉత్తమంగా పని చేస్తున్నాయని అన్నారు.
దేశాల ఉత్పాదకత, కరెన్సీల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలకు సంబంధించిన పర్చేజింగ్ పవర్ ప్యారిటీ విధానం ప్రకారం చూస్తే, భారత్ జీడీపీ 2019లో బంగ్లాదేశ్కన్నా 11 రెట్లు అధికమని అధికార వర్గాలు బుధవారం పేర్కొన్నాయి.తలసరి ఆదాయంలో భారత్ ను బంగ్లాదేశ్ అధిగమించనున్నదన్న ఐఎంఎఫ్ అంచనాల పై మాట్లాడుతూ ‘‘ఆరు సంవత్సరాల్లో బీజేపీ పాలన సాధించిన ఘనత ఇదీ’ అని రాహుల్ ఎద్దేవా చేశారు.