బీజేపీ పై సీరియస్ కామెంట్స్ చేసిన రాహుల్ గాంధీ..!!

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ బీజేపీపై మండిపడ్డారు.దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో బీజేపీ పార్టీ బాధితురాలిగా ఇండియా ని తయారు చేయవద్దని భారీ డైలాగులు వేశారు.

 Rahul Gandhi Serious Comments On Bjp Party Bjp, Rahul Gandhi, Congress, Vacin, D-TeluguStop.com

అంతేకాకుండా వ్యాక్సిన్ దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.దేశాన్ని కరోనా బారి నుండి తప్పించాలని, దానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని రాహుల్ స్పష్టం చేశారు.

దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్ సంస్థలు వాటి వ్యాక్సిన్ ధరలను అమాంతం పెంచడం తెలిసిందే.

సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ హాస్పిటల్ కి ఒక్క డోస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర 600 రూపాయలు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వాలకు నాలుగు వందల రూపాయలు  కేటాయించడం జరిగింది.

ఇదే క్రమంలో భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసే  కోవాగ్జిన్ వ్యాక్సిన్ ప్రైవేట్ హాస్పిటల్ కి 1200 రూపాయలు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వాలకి 600 రూపాయలు కేటాయించడం జరిగింది.ఇదే తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి మాత్రం 150 రూపాయలు మాత్రమే ధర నిర్ణయించడం జరిగింది.

దీంతో ఈ విధంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు ధరలు నిర్ణయించడంలో పెచ్చుమీరి పోవటంతో రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో దేశంలో వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందించాలని.

కేంద్రాన్ని డిమాండ్ చేశారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube