గతకొన్ని రోజులుగా అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించిందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.ఈ విషయంలో ఇదివరకే కొందరు రాజకీయ నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నారట.
కాగా తాజాగా ఇదే విషయం పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ, భారత భూ భాగంలో చైనా నిర్మించిన గ్రామానికి చెందిన స్క్రీన్షాట్ను తన ట్వీట్టర్కు జోడించి దేశాన్ని ఎవరి ముందు తలవంచనీయమని ట్వీట్ చేశారట.
ఇలా రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై తీవ్రంగా స్పందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, భారత్లో చైనా దుందుడుకుడు చర్యలు కొత్తేమి కాదని పేర్కొంటూ, నెలవారీ సెలవులు ముగియడం తో వెనక్కు వచ్చిన రాహుల్ గాంధీ మీరు మమ్మల్ని ప్రశ్నించే ముందు నేను మిమ్మల్ని కొన్నిప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను వాటికి మీరు ఈ రోజు జరిగే మీడియా సమావేశంలో సమాధానం చెబుతారని భావిస్తున్నాను అంటూ పలు ప్రశ్నలను ట్విట్ చేశారట.
ఇక నడ్డా ట్వీట్లపై రాహుల్ కూడా తీవ్రంగా స్పందిస్తూ, ఆయన ఎవరు? నేనెందుకు ఆయనకు సమాధానం చెప్పాలి? ఆయన నా ప్రొఫెసరా? నేను దేశానికి మాత్రమే సమాధానం చెబుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట.