కాంగ్రెస్ పార్టీ కీలక నేత గాంధీ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.పార్టీలో ఉన్న ఎవరికైనా బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే భయపడితే పార్టీ నుండి వెళ్లిపోవచ్చు, బలవంతం ఏమీ లేదు పార్టీలో ఉండనక్కర్లేదు అని తెలిపారు.
పార్టీలో ఉండి .పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎదురైతే కచ్చితంగా అలాంటివారిని పార్టీ నుండి సాగనంపడం గ్యారెంటీ అని స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే వారు అది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాకపోయినా. వాళ్లని తమ వాళ్ళగా భావిస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు.
ఇటీవల కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంతో నిర్వహించిన. వర్చువల్ సమావేశంలో.
ఈ వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి చెందిన కీలక నేతల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఉండి డ్యామేజ్ చేసే నాయకులు గురించి స్పందిస్తూ జ్యోతిరాదిత్య సింథియా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జ్యోతిరాదిత్య సింథియా తన వర్గానికి చెందిన వారిని కాపాడుకోవడానికి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలకు భయపడిపోయి చేతులు కలిపారని, అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టీలో ఉండనవసరం లేదు వెళ్ళిపోవచ్చు అని పేర్కొన్నారు. నిర్భయంగా మాట్లాడేవాళ్ళు.
పార్టీ సిద్ధాంతాలను గౌరవించే వాళ్ళు.ఇలాంటి వారు మాత్రమే కావాలి అంటూ రాహుల్ గాంధీ.
స్పష్టం చేశారు.