తెలంగాణ ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్లిన కాంగ్రెస్ – టీడీపీ పార్టీలు ఏపీ ఎన్నికల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంలో సరైన క్లారిటీ మాత్రం తెచ్చుకోలేకపోతున్నాయి.అందుకే….ఏపీ విషయంలో కలిసి ముందుకు వెళ్లాలా… వద్దా అనే విషయంలో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.ఈ సంగతి పక్కనపెడితే… తాజాగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధి చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసాడు.
ఇంతకీ విషయం ఏంటి అంటే… కాంగ్రెస్ గెలిచిన మూడు రాష్ట్రాలలో సీఎంలు ప్రమాణస్వీకారం మహోత్సవం జరుగున్నందున అక్కడ ప్రమాణ స్వీకరణ మహోత్సవానికి రావాల్సిందిగా… రాహుల్ గాంధీ చంద్రబాబు ని ఆహ్వానించారు.
అయితే….రాజస్థాన్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్న అశోక్ గెహ్లాట్ కూడా చంద్రబాబును ఫోన్ చేసి ఆహ్వానించారు.దీనితో ఆయన రేపు జైపూర్ వెళ్తున్నట్టు తెలుస్తుంది.
ఈ ప్రమాణస్వీకారాలకు వెళ్లడం ద్వారా బీజేపీ యేతర పార్టీలన్నిటిని ఏకం చేసి చక్రం తిప్పాలని బాబు భావిస్తున్నాడు.