అస్సాం ప్రభుత్వం ఇటీవల.చేపట్టిన ఇళ్ల కూల్చివేత కార్యక్రమం రణరంగంగా మారింది.
ఇల్లు కూలుస్తున్నా టైంలో నిరసనకారులు ఆందోళనలు చేస్తూ ఉండటంతో అస్సాం పోలీసులు.నిరసనకారులపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
కాల్పులు జరిపి కర్రలతో నిరసనకారులపై పోలీసులు.రెచ్చిపోవడంతో ఇద్దరు మరణించడంతో పరిస్థితి హింసాత్మక ఘటన గా మారిపోయింది.
దీంతో ఈ ఘటనపై అస్సాం ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అస్సాం ప్రభుత్వం హింసను ప్రోత్సహిస్తుంది అంటూ సంచలన కామెంట్స్ చేశారు.ఇళ్లను కూల్చివేయడాని నిరసిస్తూ.స్థానికులు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో నిరసనకారులు పోలీసులపై.
తిరగబడటం తో ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులలో ఒకరి పై కాల్పులు జరిపి కర్రలతో ముక్కుమడిగా దాడి చేశారు.దీంతో ఆ వ్యక్తి మరణించడంతో మానవ హక్కుల సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి.
ప్రభుత్వమే హింసను ప్రోత్సహిస్తోందని దేశ ప్రజల వారు ఇటువంటి ఘటనలను సహించరని రాహుల్ పేర్కొన్నారు.ప్రభుత్వ స్థలంలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయించే క్రమంలో జరిగిన ఈ దుర్ఘటనలో.
ఇద్దరు మరణించగా పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.