దేశంలో ప్రముఖుల కరోనా బారిన పడుతున్నారు.ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ … కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
తనకి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రెండు లక్షలకు పైగా నమోదవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా రోజు కొత్త పాజిటివ్ కేసులు 7,00,000 నమోదు అవుతుంటే వాటిలో ఎక్కువ శాతం.ఇండియాలోనే నమోదు కావడంతో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇండియాలో ఎక్కువగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా.
కథనాలు ప్రసారం చేస్తూ ఉంది.దీంతో దేశంలో కరోనా మహామారి అరికట్టాలంటే ఒకటి కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయడంతోపాటు వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా చేయాలని కేంద్రం డిసైడ్ అయ్యింది.