కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతులకు మాత్రమే భరోసా ఇస్తున్నారు.కాంగ్రెసు నాయకులకు కాదు.
ఎందకంటే ఆయన హైదరాబాద్కు రావడంలేదు.ఆయన నగర పర్యటన రద్దయిపోయింది.
వాస్తవానికి రాహుల్ రైతు భరోసా యాత్రలో, బహిరంగ సభలో పాల్గొన్న తరువాత హైదరాబాద్కు వచ్చి తెలంగాణ కాంగ్రెసు నాయకులతో పాటు ఏపీ కాంగ్రెసు నేతలను కూడా కలుసుకోవాల్సి ఉంది.ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధులను కూడా కలుసుకోవాలనుకున్నారు.
కాని ఇప్పుడు ఆయన పర్యటన గ్రామీణ ప్రాంతానికే పరిమితమైంది.ఆయన ఢిల్లీ నుంచి నాందేడ్ వెళ్లి అక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లా నిర్మాల్కు వస్తారు.
భద్రతా కారణాల రీత్యా ఆయన హైదరాబాద్ పర్యటన రద్దయింది.శుక్రవారం జరిగే రైతు భరోసా యాత్రలో కాంగ్రెసు నాయకులంతా పాల్గొంటారు.
మొత్తం మీద రాహుల్ హైదరాబాద్కు రాకపోవడం కాంగ్రెసు నాయకులకు పెద్ద లోటే.ఆయన నగరంలో ఉంటే ఆ హడావిడి వేరుగా ఉండేది కదా…!
.