రైతుల వరకే 'భరోసా'

కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రైతులకు మాత్రమే భరోసా ఇస్తున్నారు.కాంగ్రెసు నాయకులకు కాదు.

 Rahul Gandhi Hyderabad Visit Cancelled-TeluguStop.com

ఎందకంటే ఆయన హైదరాబాద్‌కు రావడంలేదు.ఆయన నగర పర్యటన రద్దయిపోయింది.

వాస్తవానికి రాహుల్‌ రైతు భరోసా యాత్రలో, బహిరంగ సభలో పాల్గొన్న తరువాత హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణ కాంగ్రెసు నాయకులతో పాటు ఏపీ కాంగ్రెసు నేతలను కూడా కలుసుకోవాల్సి ఉంది.ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధులను కూడా కలుసుకోవాలనుకున్నారు.

కాని ఇప్పుడు ఆయన పర్యటన గ్రామీణ ప్రాంతానికే పరిమితమైంది.ఆయన ఢిల్లీ నుంచి నాందేడ్‌ వెళ్లి అక్కడి నుంచి ఆదిలాబాద్‌ జిల్లా నిర్మాల్‌కు వస్తారు.

భద్రతా కారణాల రీత్యా ఆయన హైదరాబాద్‌ పర్యటన రద్దయింది.శుక్రవారం జరిగే రైతు భరోసా యాత్రలో కాంగ్రెసు నాయకులంతా పాల్గొంటారు.

మొత్తం మీద రాహుల్‌ హైదరాబాద్‌కు రాకపోవడం కాంగ్రెసు నాయకులకు పెద్ద లోటే.ఆయన నగరంలో ఉంటే ఆ హడావిడి వేరుగా ఉండేది కదా…!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube