కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు కు క్షమాపణలు చెప్పారు.ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ని ఉద్దేశించి ‘చౌకి దార్ చోర్’ అంటూ చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు కు తప్పుగా ఆపాదించిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు చెప్పారు.
ఈ వ్యాఖ్యలు ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదంటూ న్యాయస్థానానికి మూడు పేజీల అఫిడవిట్ కూడా దాఖలు చేసినట్లు తెలుస్తుంది.రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం పై గత ఏడాది సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ తీర్పును పునఃసమీక్షించాలి అంటూ సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలు చేయడం తో ఏప్రిల్ 10 న ఈ పిటీషన్ల ను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఆ సమయంలో రాహుల్ చౌకి కార్ చోర్ అని ఈ తీర్పు స్పష్టం చేస్తుంది అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.
దీనితో సుప్రీం తీర్పు పై రాహుల్ తప్పుగా వ్యాఖ్యానించారంటూ భాజపా నేత మీనాక్షి లేఖీ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.దీనితో దానిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తాము రఫెల్ తీర్పు లో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని,వాటిని తప్పుగా తమకు ఆపాదించారు అని స్పష్టం చేసింది.
అంతేకాకుండా రాహుల్ వ్యాఖ్యలపై కోర్టుకు వివరణ ఇవ్వాలంటూ ఏప్రిల్ 23 న నోటీసులు ఇచ్చింది.అయితే ఈ నోటీసులకు స్పందించిన రాహుల్ సుప్రీం కోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేశారు.
అయితే దానిలో కూడా పాత అంశాలనే చేర్చి తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.అయితే రాహుల్ తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడం తో తాజాగా క్షమాపణల తో కూడిన అఫిడవిట్ దాఖలు చేసి బేషరతుగా క్షమాపణలు తెలిపారు.