కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ, తన సోదరి ప్రియాంకా వాద్రతో కలిసి డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద పార్టీ పార్లమెంట్ సభ్యులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాహుల్ గాందీ మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వెనకకు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
దేశంను రైతులు యువత కలిసి నడిపిస్తున్నారు అన్నాడు .అంతే కానీ బడా బడా కార్పొరేట్ సంస్థలు కాదని అన్నాడు.ఇన్ని రోజులుగా రైతులు ధర్నాలు, దీక్షలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం వారి సమస్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నాడు.
చర్చలతో రైతులు అలిసిపోయేలా చేస్తున్నారని తెలిపాడు.
రైతులకు ప్రధాని ఏ మాత్రం గౌరవం ఇవ్వడంలేదని రాహుల్ అన్నాడు.అంతకు ముందు తన సోదరి ప్రియాంకా వాద్ర కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో కలిసి డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధికారిక నివాసం వద్ద రైతులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నాడు.
రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ ఖండించాడు.రాహుల్ ను కాంగ్రెస్ నేతలే పట్టించుకోవడం లేదని అన్నాడు.
.