బుల్లితెర హీరోయిన్ ప్రత్యూష బెనర్జీ అనుమానాస్పద మరణం తరువాత ఎక్కడ చర్చ జరిగినా, రాహుల్ మరియు ఆమె మాజీ ప్రేయసి సలోనీ పేరు వినపడుతూనే ఉంది.అయితే మొదటిసారిగా రాహుల్ మాజీ ప్రేయసి ఓ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
“ప్రత్యూషపై తాను చేయి చేసుకున్నానన్న మాట వాస్తమేనని, అయితే తానూ కొట్టిన దాని కంటే ముందే… రాహుల్ – ప్రత్యూషలు కలిసి తనపై చేయి చేసుకున్నారని, ఆ కారణంతోనే తాను అలా స్పందించాల్సి వచ్చిందని” అన్నారు.ఫిబ్రవరి 11న రాహుల్ ఉన్నాడని తెలుసుకుని, తాను కాండివ్లీ అపార్టుమెంటుకు వెళ్లానని… ఈ సందర్భంలో తానూ రాహుల్ కు ఇచ్చిన డబ్బులను ఆయన ప్రత్యూషకు ఇచ్చాడని, తిరిగి డబ్బులు చెల్లించాలంటే రాహుల్ వినకపోవడంతో… కోపం వచ్చి డబ్బు కోసం నిలదీసే ప్రయత్నం చేయడం జరిగింది.
అయితే తనను చూడగానే, రాహుల్, ప్రత్యూషలు రెచ్చిపోయి తనపై దాడి చేశారని, ఫ్లాట్ బయటకు నెట్టేశారని తెలిపింది.ఈ సందర్భంలో ఆగ్రహానికి గురైన తానూ ప్రత్యూషను కొట్టినట్లుగా” చెప్పుకొచ్చారు.
ఈ ఘటనపై తాను పోలీసు కేసు పెట్టగా, వారిద్దరూ వచ్చి తనను బతిమాలుకున్నారని, తమ కెరీర్లు పాడైపోతాయని విజ్ఞపులు చేసారని, మరో వైపు పోలీసులు కూడా ప్రజల దృష్టిలో పడాల్సి వస్తుందని హెచ్చరించడంతో ఆ కేసు ఉపసంహరించుకున్నట్టు తెలిపారు.ఈ మొత్తం ఉదంతం గురించి ఇప్పటికే పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చానని సలోనీ తెలిపారు.