తెలుగు ప్రేక్షకులకు మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించి తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు ఏఆర్ రెహమాన్.
అంతేకాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఏఆర్ రెహమాన్ కూడా ఒకరు.ఇది ఇలా ఉంటే తాజాగా ఏ ఆర్ రెహమాన్ కుమార్తెలు రతీజా రెహమాన్,రహీమా రెహమాన్ ఒక సూపర్ లగ్జరీ కారునీ కొనుగోలు చేశారు.
అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతున్నాయి.కాగా ఆ కారు ధర నిన్న చాలా మంది నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
ఏఆర్ రెహమాన్ కూతుర్లు పోర్షే టైకాన్ కారును కొనుగోలు చేసిన విషయాన్ని రెహమాన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ యువ నిర్మాతలు కూల్ మోటావర్స్ ప్రాజెక్ట్ లీడర్స్ రతిజా,రహిమా కారు కొన్నందుకు, ముఖ్యంగా కాలుష్య రహిత కారణం ఎంచుకోవడంపై సోషల్ మీడియా ద్వారా సంతోషాన్ని ప్రకటించారు.
గర్ల్ పవర్ అంటూ గర్వాన్ని ప్రకటించారు.ఏఆర్ఆర్ స్టూడియోస్ పేరుతో ఉన్న ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును పక్కనే ఖతిజా, రహీమా నిలబడి ఉన్న ఫోటోని కూడా షేర్ చేశారు.
ఇకపోతే ఆ కారు ధర విషయానికి వస్తే.రూ.1.53 కోట్ల నుంచి రూ.2.34 కోట్లు ఉంటుంది.
ఏఆర్ రెహమాన్ షేర్ చేసిన ఆ ఫోటోలో ఒకరు స్టైల్ గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఫోటోకి ఫోజులు ఇవ్వగా మరొకరు పద్ధతిగా స్కర్ఫ్ కట్టుకొని మాస్క్ వేసుకొని కారు పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కాగా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు వరుసగా కార్లను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒక లగ్జరీ కారును కొనుగోలు చేశారు.