ఏదైనా ఒక మ్యాచ్ ఓడిపోతే చాలు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ మీద ఎన్నో అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉంటారు.ఇక కోహ్లీ కెప్టెన్సీపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో తనను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన ఓ విలేకరికి టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే చురకలంటించాడు.
మీకు కావాల్సిన మసాలా వార్తలు ఇక్కడ దొరకవని స్పష్టం చేశాడు.
ఇక శనివారం నుంచి ఇంగ్లండ్ తో రెండో టెస్ట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో మీడియాతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ఆయన మాట్లాడుతూ జట్టు మొత్తానికి కోహ్లీ కెప్టెన్సీ పై పూర్తి నమ్మకం ఉందని, అతనే తమ కెప్టెన్ గా కొనసాగుతాడని, ఇకనైనా కెప్టెన్సీ పై ఉహాగానాలకు చెక్ పెట్టాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
తన బ్యాటింగ్ వైఫల్యంపై మాట్లాడుత గత వైఫల్యాలను బేరీజు వేసుకొని, రెండో టెస్ట్ కు అన్ని విధాల సన్నద్దమయ్యానన్నాడు.
అయితే ఈ వ్యాఖ్యలనే రహానే ముందు ప్రస్తావించిన జర్నలిస్టు ఆటగాళ్ల శక్తి సామర్థ్యాలు తగ్గడానికి కెప్టెన్సీ మార్పే కారణమా ? అని ప్రశ్నించాడు.మైదానంలో ఒకే విధమైన శక్తిని కలిగి ఉండటం ఎప్పుడూ సాధ్యం కాదని బదులిచ్చిన రహానే దానికి విరాట్ కోహ్లీ కెప్టెన్ గా తిరిగి రావడం కారణం కాదన్నాడు.అతనే తమ కెప్టెన్ గా కొసాగుతాడని, మసాల వార్తలు ఇక్కడ దొరకవని తేల్చి చెప్పాడు.
ఇక శనివారం నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్ లో స్పిన్నర్లు చెలరేగుతారని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు.తొలి టెస్ట్ లో ఎదురైన పరాభావాన్ని మరిచిపోయి, తదుపరి టెస్ట్ లో సర్వ శక్తులు ఒడ్డి విజయం కోసం కృషి చేస్తామన్నాడు.
ఇటీవల కాలంలో రహానే కెప్టెన్ గా రాణించినా, బ్యాట్స్మన్ గా పూర్తిగా విఫలమవుతున్నాడని మాజీ క్రికెటర్లు అతనిపై విమర్శలు గుప్పించారు.