శాండిల్ వుడ్ లో ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారింది.డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆధారాలు లభించడంతో హీరోయిన్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీని ఇప్పటికే నార్కోటిక్ కంట్రోల్ బోర్డు పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
అలాగే వీరు డ్రగ్స్ వాడుతున్నారా లేదా అనే విషయాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.అయితే వీళ్ళు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు అని తెలియడంతో డ్రగ్స్ టెస్ట్ కోసం శాంపిల్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు.
అయితే సంజనా గల్రానీ శాంపిల్స్ ఇవ్వడానికి ససేమీరా అంటుంది.ఇక రాగినీ ద్వివేది అయితే డ్రగ్స్ ఆనవాళ్ళు దొరకకుండా ఉండటానికి చీప్ ట్రిక్స్ ప్లే చేసింది.
అయితే ఆమె చీప్ ట్రిక్స్ ని డాక్టర్లు గుర్తించేశారు.
రాగినీ ద్వివేదిని డ్రగ్స్ టెస్టింగ్ నిమిత్తం బెంగళూరులోని కేపీ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అయితే, డోప్ టెస్ట్ కోసం ఇచ్చిన యూరిన్ శాంపిల్ విషయంలో రాగిణి చీటింగ్ చేసినట్టు సమాచారం.తన యూరిన్ లో కొంత నీటిని ఆమె మిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
శాంపిల్ లో వాటర్ మిక్స్ అయినట్టు వైద్యులు గుర్తించారని తెలుస్తుంది.దీంతో మరోసారి ఆమె వద్ద నుంచి శాంపిల్ తీసుకుని పంపినట్టు సమాచారం.
అయితే డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయితే వారిని మరింత విచారించి ఇంకా ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనే విషయాలని కూడా కూపీ లాగే ప్రయత్నం చేస్తారు.ఇప్పటికే వీళ్ళు కన్నడ పరిశ్రమలో కొంత మంది ప్రముఖుల పేర్లు బయట పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే మహిళలు కాబట్టి వారిని టార్గెట్ చేసి హింసిస్తున్నారని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి.