గజ తుఫాను ధాటికి తమిళనాడులో అనేక మంది నిరాశ్రయులయ్యారు.ఇందులో ఆస్తి నష్టంతో పాటు.
ప్రాణనష్టమూ సంభవించింది.బాధితులను ఆదుకోవడానికి తమిళ సినీ ప్రముఖులు ముందుకువచ్చారు.
అందులో భాగంగా ప్రముక కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ ఓ యాబై మందికి ఇళ్ళను కట్టిస్తానని చెప్పారు.
తుఫాను ధాటికి ఓ వృద్దురాలి ఇళ్లు కూలిపోయింది.అందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవడంతో లారెన్స్ స్పంధించాడు.తాను కట్టిస్తానన్న 50 ఇళ్ళలో భాగంగా మొదటి ఇల్లును ఆ వృద్దురాలికే కట్టిస్తానని మాటిచ్చారు.
ఇంకా ఎవరైనా ఇలాంటి వారు ఉంటే తనకు ఆ వివరాలు అందించాలని లారెన్స్ కోరాడు.