వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఐడీ తనని అరెస్టు చేసిన సమయంలో ఫోన్ తీసేసుకున్నరని దానిలో విలువైన సమాచారం ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రఘురామకృష్ణం తరపు న్యాయవాది ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ కు లీగల్ నోటీసులు ఇచ్చారు.
ఏపీ సీఐడీ మరికొంత మంది పోలీసులు రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసిన సమయంలో విలువైన వస్తువులు తీసుకుని ఇవ్వలేదని నోటీసులో పేర్కొన్నారు.తీసుకున్న ఐఫోన్ రికార్డుల్లో ఎక్కడా కూడా చూపించలేదని ఆరోపించారు.
అంతేకాకుండా విచారణ సమయంలో కస్టడీలో తనని హింసించి తన సెల్ ఫోన్ పర్సనల్ కోడ్ ఓపెన్ చేయాలని అనేక ఇబ్బందులకు సిఐడి పోలీసులు గురి చేసినట్లు తెలిపారు.పార్లమెంటులో స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పార్లమెంటు విధులు నిర్వర్తించేందుకు వీలుగా తిరిగి తన ఫోన్ ఇచ్చేయాలని నోటీసులో రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు ఏ మాత్రం ఫోన్ ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేస్తే సివిల్ , క్రిమినల్ చర్యలు ఉంటాయని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో మంగళగిరి సిఐడి హెచ్ఎస్ఓకు లీగల్ నోటీసులిచ్చారు
.