వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.తమ ప్రభుత్వం అప్పులు తీసుకునే విషయంలో సరికొత్త కోణాలలో ఆలోచిస్తుందని చెప్పుకొచ్చారు.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీ స్టేట్ రోడ్ డెవలప్ మెంట్ కింద రూ.3 వేల కోట్ల అప్పు తీసుకొచ్చిందని తెలిపారు.ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఒక జీవో తీసుకొచ్చి 574 ఎకరాలు, ఆర్ అండ్ బీ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావాలనుకుంటోందని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ప్రజలకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వం ఏవిధంగా అమ్ముతుంది అన్ని … ఆ హక్కు ప్రభుత్వానికి లేదని తెలిపారు.
చెత్త నుండి సంపద సృష్టించే సెంటర్లకు వైసిపి రంగులు వేయగా ఇటీవల న్యాయస్థానం సీరియస్ గా ఉందని తాజాగా చెప్పుకొచ్చారు.ప్రభుత్వ ఉద్యోగులు అనేక అవస్థలు పడుతున్నారని వారికి డిఎ .ఇంకా అనేక రకాలుగా ప్రభుత్వం బకాయిలు పడింది అని చెప్పుకొచ్చారు.రిటైర్డ్ ఉద్యోగస్తులకు సరైన టైంలో కూడా పెన్షన్ అందటం లేదని రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.