ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి గత కొంత కాలం నుండి వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనేక విషయాలపై లెటర్లు లో రాస్తున్న సంగతి తెలిసిందే.నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరిట రఘురామకృష్ణంరాజు రాస్తున్న లెటర్లు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.
ప్రజలకు గతంలో ఇచ్చిన హామీల విషయంలో ఏవైతే ఆలస్యం అవుతున్నయో వాటిని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావిస్తూ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్ కి లెటర్ రాయడం జరిగింది.
మేటర్ లోకి వెళ్తే కరోనా నేపథ్యంలో జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ హెల్త్కార్డులు జారీ చేయాలని స్పష్టం చేశారు.ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ తో గుర్తించి వారికి కల్పిస్తున్న సదుపాయాలు జర్నలిస్టులకు కూడా కల్పించాలని కోరారు.ఇదే రీతిలో అక్రిడిటేషన్ కమిటీ ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టారు.ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో జర్నలిస్టులకు హామీలు ఇవ్వడం జరిగిందని.వాటిని వెంటనే నెరవేర్చాలని లెటర్లో స్పష్టం చేశారు.జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలి అని జగన్ ప్రభుత్వానికి రఘురామకృష్ణంరాజు సూచించారు.