వైయస్ జగన్, విజయసాయి రెడ్డి ల బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సిబిఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ సీబీఐ న్యాయస్థానం కొద్ది గంటల ముందు డిస్మిస్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు సిబిఐ తీర్పుపై స్పందిస్తూ… హైకోర్టులో అప్పీల్ కి వెళ్తానని.
న్యాయవాదులతో చర్చించి వచ్చేవారం ప్రారంభంలోనే హైకోర్టులో అప్పీల్ చేస్తానని పేర్కొన్నారు.హైకోర్టు తీర్పు కూడా ఇలాగే ఉంటే.
సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని.ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
అంతేకాకుండా సీబీఐ కోర్టు తీర్పు ఈ విధంగా ఉంటుందని తాను గత నెల 25వ తారీకు నాడు అంచనా వేయడం జరిగిందని అందువల్లే ఈ విషయంపై హైకోర్టుకి వెళ్ళటం జరిగిందని బెయిల్ రద్దు పిటిషన్లు.న్యాయ స్థానం కొట్టేసినట్లు సాక్షిలో బ్రేకింగ్ వచ్చిన టైంలోనే తాను ఈ పరిస్థితిని అంచనా వేసినట్లు వ్యాఖ్యానించారు.ఏది ఏమైనా సిబిఐ తాజా తీర్పు పై హైకోర్టు వెళ్తాం .అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తానని.జగన్, విజయసాయి రెడ్డి ల బెయిల్ రద్దు అంశంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.