ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ సీఐడీ పోలీసులు తనని కొట్టినట్లు కాళ్ళకి ఉన్న గాయాలను నిన్న న్యాయమూర్తి ముందు.చూపించటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోర్టు ఓ కమిటీని నియమించి రఘురామకృష్ణం రాజుకి గాయాలకి గల కారణం తెలియజేయాలని .వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.ఈ క్రమంలో గుంటూరు జిజిహెచ్ హాస్పిటల్ లో రఘురామకృష్ణంరాజుకి 18 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.అనంతరం తాజాగా హైకోర్టు కి మెడికల్ కమిటీ ఈ నివేదిక అందించింది.
రఘురామకృష్ణంరాజు కాలి కి సంబంధించి ఎటువంటి గాయాలు లేవని నివేదికలో పేర్కొంది.పరిస్థితులు ఇలా ఉండగా ఎంపీ రఘురామకృష్ణంరాజుని వెంటనే రమేష్ ఆసుపత్రికి తరలించండి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.రమేష్ హాస్పిటల్ పై క్రిమినల్ కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాది వాదనలు విని ఆ వివరాలు తో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే వైద్యపరీక్షల అనంతరం ఏపీ పోలీసులు రఘురామకృష్ణంరాజు ని గుంటూరు జిల్లా కర్మాగారం కి తరలించారు.
ఈ క్రమంలో హైకోర్టు ఆస్పత్రికి ఆయన తరలించాలని తెలపడంతో .ఏపీ రాజకీయలలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది.
.