జగన్ బెయిల్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రఘురామకృష్ణంరాజు..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గతంలో సీబీఐ న్యాయస్థానంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేయడం తెలిసిందే.ఆ సమయంలో సీబీఐ న్యాయస్థానం రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్లో అవకతవకలు ఉన్నాయని తగిన పత్రాలు లేవని రిటర్న్ చేసి మళ్ళి దరఖాస్తు చేయాలి అని తెలిపింది.

 Raghuram Krishna Raju Made Shocking Comments On Jagan's Bail , Raghuram Krishna-TeluguStop.com

ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో రఘురామకృష్ణంరాజు తమ సీనియర్ కౌన్సిల్ న్యాయవాది జగన్ బెయిల్ రద్దు కు సంబంధించి సీబీఐ న్యాయస్థానంలో నేడు తాజాగా పిటిషన్ వేసినట్లు వాదనలు వినిపించినట్లు వీడియో ద్వారా తెలియజేశారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి వాదనలు విని ఈనెల 27వ తారీకు తీర్పు చెప్పనున్నట్లు వీడియో లో రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.

ఈ క్రమంలో జగన్ బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందని తమ న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.దీంతో రఘురామకృష్ణంరాజు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈనెల 27 వ తారీఖున సిబిఐ కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో అన్న ఉత్కంఠత వైసిపి శ్రేణులలో నెలకొంది.మరోపక్క సీనియర్ న్యాయవాదులు జగన్ కి నోటీసులు ఇవ్వకుండా సిబిఐ కోర్టు తీర్పు చెప్పే అవకాశం లేదని కామెంట్లు చేస్తున్నారు.

ఏది ఏమైనా వైసీపీ పార్టీ రెబెల్ ఎంపి రఘురామకృష్ణంరాజు మాత్రం ఈ నెల 27 వ తారీఖున సిబిఐ న్యాయస్థానం జగన్ బెయిల్ పై తీర్పు చెప్పే అవకాశం ఉన్నట్లు వీడియోలో తెలపటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube