హుజురాబాద్ ఉప ఎన్నికల పై సంచలన కామెంట్స్ చేసిన రఘునందన్ రావు..!!

దుబ్బాక ఉపఎన్నికల్లో అప్పట్లో సత్తా చాటి టిఆర్ఎస్ పార్టీ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు.తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికల పై సంచలన కామెంట్స్ చేశారు.

 Raghunandan Rao Made Sensational Comments On Huzurabad By-election , Bjp, Raghun-TeluguStop.com

అధికార పార్టీ టిఆర్ఎస్ ఉప ఎన్నికలలో ఎన్ని వ్యూహాలు.కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా, ఎంత మంది ఎమ్మెల్యేలు.

మంత్రులు అదే రీతిలో వంద మంది ముఖ్యమంత్రులు వచ్చినా.ఈటల గెలుపును ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.14 ఏళ్ళు ఉద్యమ పార్టీ అదే రీతిలో ఏడు సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఒక బీసీ నాయకుడి ని కూడా తయారు చేసుకో లేకపోయింది అంటూ టిఆర్ఎస్ పార్టీపై వ్యంగ్యంగా విమర్శలు చేశారు.

గతంలో దుబ్బాక ఉప ఎన్నికల టైంలో వేసిన డైలాగులు మళ్లీ ఇప్పుడు అదే రీతిలో వేస్తున్నారని దుబ్బాక లో లక్ష మెజారిటీ తో గెలిచినట్టు.

హుజురాబాద్ ఉప ఎన్నికల లో.వ్యవహరిస్తున్నారని టిఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు.టిఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు డబ్బులు ఉప ఎన్నికలలో వెదజల్లిన.ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి అంటూ రఘునందన్ రావు పిలుపునిచ్చారు.దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి ఏ రీతిగా పని చేసిందో.అదే రీతిలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కూడా పనిచేస్తుందని.

పేర్కొన్నారు.ఈ  ఉప ఎన్నికలలో పోటీ బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ మాత్రమేనని రఘునందన్ రావు స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube