ఐదోసారి జగన్ కి లెటర్ రాసిన రఘురామకృష్ణంరాజు..!!

వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఐదో సారి సీఎం జగన్ కి లెటర్ రాశారు.  ఇప్పటికే నాలుగు సార్లు లెటర్ లు రావడం తెలిసిందే.

 Raghu Ramakrishnam Raju Writes A Letter To Ys Jagan Fifth Time, Raghu Ramakrishn-TeluguStop.com

మొదటిసారి వృద్ధాప్య పింఛను పెంపు, రెండవ సారి సిపిఎస్ రద్దు, మూడవసారి వైయస్సార్ పెళ్లి కానుక, నాలుగవ సారి ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ వంటి హామీల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని గతంలో లెటర్లు రాయడం జరిగింది.అయితే ఇప్పుడు ఐదవసారి అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పరిహారం పై జగన్ ప్రభుత్వాన్ని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించడం జరిగింది.

అప్పట్లో అధికారంలోకి వచ్చిన వెంటనే 80 శాతం అగ్రిగోల్డ్ బాధితులకు మేలు చేసే రీతిలో 11 వందల కోట్లు విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.దాన్ని వెంటనే నెరవేర్చాలని బాధితులకు పరిహారం ఇవ్వాలని .బాధితుల్లో ఎక్కువగా కూలీలు మరియు చిన్న వ్యాపారస్తులు  ఉన్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.ఇప్పటికే నాలుగు సార్లు లేఖ అస్త్రాలతో జగన్ ప్రభుత్వాన్ని.

అనేక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన రఘురామకష్ణంరాజు ఐదవసారి లెటర్ రాయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube