టెలివిజన్ లో నటుడుగా కెరియర్ ప్రారంభించి తరువాత గాయకుడుగా మారి, సంగీత దర్శకుడుగా సక్సెస్ అయ్యి మళ్ళీ నటుడుగా తన సత్తా నిరూపించుకోవడానికి రెడీ అవుతున్న మల్టీ టాలెంటెడ్ రఘుకుంచె.ఇండస్ట్రీలోకి గాయకుడు కావాలనే కలలతో వచ్చిన రఘుకుంచె కెరియర్ ఆరంభంలో నటుడుగా కూడా రాణించాడు.
అయితే సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ అయిన తర్వాత మరల ముఖానికి రంగు వేసుకునే అవకాశం రాలేదు.అయితే రీసెంట్ గా పలాస సినిమాలో విలన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మెప్పించాడు.
దీంతో ఇప్పుడు ఇతనికి అవకాశాలు క్యూ కడుతున్నాయి.
ప్రస్తుతం ఒటీటీలో వెబ్ సిరీస్ ల హవా నడుస్తుంది.
ఈ నేపధ్యంలో నెట్ఫ్లిక్స్ రూపొందించే ఓ వెబ్ సిరీస్ లో తెరకెక్కనున్న బయోపిక్ స్టొరీలో టైటిల్ రోల్ కోసం రఘుకుంచెని సంప్రదించడం జరిగిందని, అతను కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.ఇది ఓ తెలుగు రాజకీయనాయకుడి బయోపిక్ అని సమాచారం.
ప్రముఖ దర్శకుడు ఈ బయోపిక్ ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.ఇక నటుడుగా ఉంటూనే మరో వైపు నిర్మాతగానూ రఘు కుంచె తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.జీ5లో విడుదలైన 47 డేస్ కి తనే నిర్మాత.ఇందులో సత్యదేవ్ కథానాయకుడిగా నటించాడు.
సత్యదేవ్తోనే హీరోగా మరో సినిమాని నిర్మించే ప్రయత్నాల్లో రఘు కుంచె ఉన్నాడని టాక్ వినిపిస్తుంది.