టాలీవుడ్ లో దర్శకేంద్రుడుగా అరుదైన గౌరవం సొంతం చేసుకున్న వ్యక్తి రాఘవేంద్రరావు.శతాధిక చిత్రాల దర్శకుడుగా తిరుగులేని సక్సెస్ రేట్ తో సినిమాలు చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు ఎప్పుడు కెమెరా వెనక ఉండి యాక్షన్, కట్ చెప్పడం తప్ప కెమెరా ముందుకి రాలేదు.
దర్శకదిగ్గజం దాసరి అటు దర్శకుడుగా చేస్తూనే నటుడుగా కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు.అయితే రాఘవేంద్రరావు మాత్రం తెరపై కనిపించడానికి ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు.
ఆయన అప్పుడప్పుడు గెస్ట్ పాత్రలలో కనిపించిన పూర్తి నిడివి ఉన్న పాత్రలు మాత్రం చేయలేదు.అయితే మొదటిసారిగా దర్శకుడు చైర్ నుంచి ఆయన నటుడు చైర్ లోకి రాబోతున్నారు.
ఆయన చివరిగా ఓం నమో వెంకటేశాయా అనే సినిమా తెరకెక్కించారు.
ప్రస్తుతం దర్శకత్వానికి దూరంగా ఉంటూ వస్తున్న రాఘవేంద్రరావుని తనికెళ్ళ భరణి ఏకంగా మెయిన్ లీడ్ యాక్టర్ గా పరిచయం చేస్తున్నారు.ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, ఈ సినిమాలో నటించడానికి రాఘవేంద్రరావు ఓకే చెప్పారని తెలుస్తుంది.కె.రాఘవేంద్రరావు స్థాయికి తగ్గట్టుగా ఆ పాత్ర హుందాగా ఉండబోతందని తెలుస్తోంది. పింక్, చీనీకమ్, బ్లాక్ చిత్రాల్లో అమితాబచ్చన్ చేసిన పాత్రల తరహాలో రాఘవేంద్రరావు పాత్ర ఉండబోతుంది అని సమాచారం.
అందుకే దర్శకేంద్రుడు కూడా ఈ కథకు ఓకే చెప్పారని వినిపిస్తుంది.మిథునం తరవాత తనికెళ్ల భరణి మళ్ళీ మెగా ఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.
వచ్చే యేడాది ప్రధమార్థంలో ఈ చిత్రం పట్టాలెక్కబోతోందని టాక్.