ప్రభుత్వం దేశంలో హిందుత్వ, హిందుత్వ వ్యతిరేక వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.కొన్ని ప్రాంతాలలో క్రిస్టియన్, హిందూ మతాల మధ్య, మరికొన్ని చోట్ల హిందూ-ముస్లిం మతాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది.
ఇక బీజేపీ పాలనని హిందూయేతర మతాలు ముఖ్యంగా ముస్లిం, క్రిస్టియన్ వారు ఎక్కువగా వ్యతిరేకిస్తూ దేశంలో అభద్రతా భావం పెరిగేలా చేస్తున్నారు.జాతి విద్వేష, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తైతే కొంత మంది అన్ని మతాలని సమ దృష్టితో చూస్తూ ఉంటారు.అందరిని ఒకేలా ఆదరిస్తారు.
అలాంటి వారిలో సినిమా హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ ముందుంటారు.
సామాజిక సీవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుండే లారెన్స్ ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశాడు.
గురు రాఘవేంద్రస్వామి జయంతి సందర్భంగా హిందూ,ముస్లిం,క్రిస్టియన్ మతాలకి ఒకే దేవాలయం నిర్మిస్తానని కీలక ప్రకటన చేశారు.ఇప్పుడు ఈ ప్రకటన మీద చాలా మంది ఆయనకి మద్దతుగా నిలబడగా, కొంత మంది మత చాందస వాదులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
అన్ని మతాలు సమానమే, ఆయా మత గ్రందాలలో చెప్పే సత్యం ఒకటే అనే విషయాన్ని బలంగా విశ్వసించే లారెన్స్ అన్ని మతాలని విశ్వసిస్తూ ఉంటాడు.అందుకే ఈ ప్రకటన చేశాడు.
మొత్తానికి అతని ప్రకటన ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలలో లారెన్స్ మరోసారి తన గొప్ప మనసు చూపించుకున్నాడు అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
.