కొరియోగ్రాఫర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ లారెన్స్ తన మంచి మనసును చాటుకుంటూనే ఉన్నాడు.కరోనా విపత్తు నేపథ్యంలో తనవంతు సాయంగా మూడు కోట్ల విరాళంను ఇచ్చి రియల్ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు.
ప్రతి ఒక్కరు కూడా ఆయన తీరున దాతృత్వం చాటుకోవాలంటూ నలుగురు మెచ్చుకునేలా తన దాతృత్వంను చాటుకున్నాడు.మూడు కోట్లు ఇచ్చిన తర్వాత కూడా తెలుగు మరియు తమిళ సినిమా పరిశ్రమకు చెందిన కొందరు డాన్సర్ల బ్యాంకు అకౌంట్లో పాతిక వేల చొప్పున డబ్బులు కూడా జమ చేశాడు.
తాజాగా లారెన్స్ మరోసాని తన మంచి మనసును చాటుకున్నాడు.తాజాగా తమిళనాడుకు చెందిన ఒక జర్నలిస్ట్ తల్లి కేరళలో చికిత్స పొందుతూ మృతి చెందింది.ఆమె మృతదేహంను అప్పగించేందుకు హాస్పిటల్కు లక్షన్నర చెల్లించాల్సి ఉంది.ఆ జర్నలిస్ట్ వద్ద అంత డబ్బు లేకపోవడంతో లారెన్స్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.
ఆ డబ్బులు చెల్లించి జర్నలిస్ట్ తల్లి మృతదేహంను తమిళనాడుకు వచ్చే ఏర్పాట్లు చేశాడు.
తమిళంలోనే కాకుండా ఇండియా మొత్తం మంచి క్రేజ్ను దక్కించుకున్న లారెన్స్ ఇలాంటి మంచి పనులతో మరింతగా స్టార్డంను దక్కించుకున్నాడు.
లారెన్స్ తన ఫౌండేషన్లో కొన్ని వందల మంది వికలాంగులకు మరియు వృద్దులకు ఆశ్రయం కల్పించాడు.ప్రతి ఒక్కరు కూడా ఆయన్ను దేవుడిగా పూజిస్తారు.ఆయన గొప్పతనం అంతా ఇంతా కాదంటారు.ఇక ప్రస్తుతం బాలీవుడ్లో లక్ష్మీ బాంబ్ చేస్తున్న లారెన్స్ మరో వైపు చంద్రముఖి చిత్రం సీక్వెల్లో కూడా నటిస్తున్నాడు.