యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘రాధేశ్యామ్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా పూజాహెగ్దే నటిస్తోంది.కరోనాకు ముందే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తవ్వగా.
ఆ తర్వాత కరోనా ప్రభావం పెరగడం, లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది.
అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ను తిరిగి మొదలుపెట్టారు.
ప్రస్తుతం ఇటలీలో రాధేశ్యామ్ షూటింగ్ జరుగుతోంది.తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
కాగా రాధేశ్యామ్ విడుదలకు ముందే రికార్డులు నమోదు చేస్తోంది.ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ను విడుదల చేయగా.
ఇది సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది.కేవలం నాలుగు రోజుల్లో ఈ మోషన్ పోస్టర్ 25 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించింది.
ఇండియాన్ సినిమాలో చరిత్రలో ఒక మోషన్ పోస్టర్కు అత్యధిక వ్యూస్ రావడం ఇదే తొలిసారి అని సినీ వర్గాలు చెబుతున్నారు.సినిమా రిలీజ్కు ముందే అభిమానులు ఇంతగా ఆదరించడం చాలా ఆనందంగా ఉందని రాధేశ్యామ్ యూనిట్ ప్రకటించింది.