తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా వందల సంఖ్యలో సినిమాల్లో హీరోయిన్ గా నటించి రాధికా శరత్ కుమార్ గుర్తింపును సంపాదించుకున్నారు.అయితే గత రెండు, మూడు రోజుల నుంచి రాధికా శరత్ కుమార్ ఆరోగ్యానికి సంబంధించి కోలీవుడ్ మీడియాలో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి.
ఆరోగ్యం గురించి తప్పుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాధికా శరత్ కుమార్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.
తనపై ప్రేమాభిమానులు చూపిస్తున్న వాళ్లకు రాధిక సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
తనకు కరోనా సోకిందంటూ వదంతులు వైరల్ అవుతున్నాయని ఆ వార్తల్లో నిజం లేదని ఆమె చెప్పుకొచ్చారు.కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న తరువాత తనకు ఒళ్లు నొప్పులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానని రాధిక సోషల్ మీడియాలో వెల్లడించారు.
వృత్తిపరంగా తాను మళ్లీ బిజీ అవుతున్నానని రాధిక పేర్కొన్నారు.
కొందరు కావాలనే తన హెల్త్ గురించి ఫేక్ వార్తలను ప్రచారంలోకి తెస్తున్నారని ఆ వార్తలను నమ్మవద్దని రాధిక సూచించారు.ఎవరైతే తన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకుంటానని ఆమె వెల్లడించారు.
కరోనా సోకిందంటూ వైరల్ అవుతున్న రూమర్లకు ఆమె ఈ విధంగా చెక్ పెట్టారు.
మరోవైపు చెక్ బౌన్స్ కేసులో రాధిక, శరత్ కుమార్ దంపతులకు కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది.సకాలంతో అప్పును తీర్చలేకపోవడంతో చెన్నై స్పెషల్ కోర్టు దంపతులకు జైలు శిక్ష విధించడం గమనార్హం.2015 సంవత్సరంలో ఒక సినిమా కోసం రాధికా శరత్ కుమార్ దంపతులు రేడియంట్ గ్రూప్ నుంచి ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకున్నారు.అయితే వేర్వేరు కారణాల వల్ల ఆ అప్పును సకాలంలో తీర్చలేకపోయారు.రేడియంట్స్ గ్రూప్ కు రాధికా శరత్ కుమార్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో చెన్నై స్పెషల్ కోర్టు రాధికా శరత్ కుమార్ దంపతులకు జైలు శిక్ష విధించింది.