సూపర్ స్టార్ రజనీకాంత్ కు దేశవిదేశాల్లో కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.రజనీకాంత్ సినిమాలు విడుదలైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.అయితే అన్ స్టాపబుల్ సీజన్2 కు గెస్ట్ గా హాజరైన రాధికా శరత్ కుమార్ రజనీకాంత్ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.
రజనీకాంత్ బోరింగ్ మనిషి అని రాధికా శరత్ కుమార్ చెప్పుకొచ్చారు.రజనీకాంత్ తన పని తాను చేసుకుంటూ ఉంటారని ఏదో ఒక మూలన కూర్చుని ఇతరులతో ఎక్కువగా మాట్లాడకుండా ఉంటారని చెప్పుకొచ్చారు.
కమల్ హాసన్ కు ప్రొఫెషన్ తప్ప మరో ఫోకస్ ఉండదని రాధిక పేర్కొన్నారు.రాధిక చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ షోలో బాలయ్య మాట్లాడుతూ నా ఫ్రెండ్స్ కూడా అన్ స్టాపబుల్ అని చెప్పుకొచ్చారు.బాలయ్య సినిమాకు డేట్లు లేవని నేను ఎప్పుడూ చెప్పలేదని రాధిక అనగా రాబోయే రోజుల్లో చేద్దామని బాలయ్య చెప్పారు.
చిరంజీవితో ఎప్పుడూ ఫైట్ చేస్తానని ఆమె అన్నారు.ఆ తర్వాత బాలయ్య మూడు రాజధానుల గురించి అడగగా కిరణ్ కుమార్ రెడ్డిని అడగగా మూడు రాజధానులు కలిసి ఉంటే బాగుంటుందని ఆయన తెలిపారు.
పిల్లలు పుట్టాలంటే పెళ్లి చేసుకోవాల్సిందేనా అనే ప్రశ్నకు రాధిక మాట్లాడుతూ ప్రస్తుతం ఆలోచనల విధానం మారిపోయిందని ఆమె అన్నారు.ఎందుకు పిల్లలు అని చాలామంది అమ్మాయిలు అడుగుతున్నారని రాధిక అన్నారు.అమ్మాయిలు అలా చెప్పడంతో నేను ఆశ్చర్యానికి గురయ్యానని రాధిక వెల్లడించారు. రాధిక, సురేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఈ షోలో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.