ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుండి తమను తాము రక్షించుకునేందుకు ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.ఇక ఈ వైరస్ సోకిందా లేదా అని పలువురికి పరీక్షలు కూడా చేశారు.
ఇటీవల ఓ స్టార్ బ్యూటీ మాస్క్ వేసుకుని ఆసుపత్రికి వెళ్లింది.దీనికి సంబంధించి ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీంతో ఆమెకు కరోనా సోకిందా? లేక కరోనా పరీక్ష చేయించుకునేందుకు వెళ్లిందా? అంటూ పలు సందేహాలను ఆమె ఫ్యాన్స్ వ్యక్తపరిచారు.బాలీవుడ్ స్టార్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి అందరికీ తెలిసిందే.
కాగా మూడు రోజుల క్రితం ఈమె ఆసుపత్రిలో మాస్క్ వేసుకుని కూర్చుంది.దీంతో ఆమెకు ఏమైందా అని అందరూ ఆడిగారు.
ఆమె తనకు కరోనా ఉందో లేదో టెస్ట్ చేయించుకునేందుకు వెళ్లలేదని, తన స్నేహితురాలికి ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం వెళ్లానంటూ చెప్పుకొచ్చింది.
ఇలా ముఖానికి మాస్క్ వేసుకుని ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఎందుకు వెళ్లావో, అప్పుడే స్పష్టంగా చెప్పుంటే ఆమె ఫ్యాన్స్ ఇంత హైరానా పడేవారు కాదు కదా అని పలువురు కామెంట్ చేస్తున్నారు.
మొత్తానికి రాధికా ఆప్టే వెళ్లింది కరోనా కోసం కాదు కడుపు కోసం అని తెలిసి ఆమె ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.