బంధు ప్రీతి.బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం తర్వాత ఎన్ని సంచలన విషయలు బయటపడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బాలీవుడ్ లో బంధు ప్రీతిపై నెటిజన్లు అంత ఫైర్ అవుతున్నారు.వారసత్వంగా వచ్చే వారికి మాత్రమే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని సామాన్యులను ఇండస్ట్రీలో ఎదగనివ్వరు అని ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు సామాన్యులలో టాలెంట్ ఉన్నప్పటికి కులం, మతం చూపి సినిమాల్లో ఉండకుండా చేస్తారని మరికొందరు అంటున్నారు.నిజానికి ఎంతోమంది వారసులు బంధు ప్రీతితో సినిమాల్లోకి అడుగు పెట్టారు.
కానీ కొందరే క్లిక్ అయ్యారు.సామాన్యులకు.
సెలబ్రెటీ పిల్లలకు కొన్ని తేడాలు మాత్రమే ఉన్నాయ్.
టాలెంట్ ఉండి కూడా కొందరికి గాడ్ ఫాదర్ లేక సినిమాలు అవకాశాలు రావట్లేదు.
కానీ టాలెంట్ లేకపోయినా సెలబ్రెటీ పిల్లలకు అవకాశాలు వస్తాయ్.అయితే టాలెంట్ ఉన్న వారికి ఒకసారి అవకాశం వచ్చిన స్టార్ సెలబ్రెటీస్ అవుతారు.
అలానే టాలెంట్ లేని వాడికి అవకాశం వచ్చిన ఒక సినిమా లేదా రెండు సినిమాలకే పరిమితం అవుతారు.
ఇక ఈ నేపథ్యంలోనే రాధికా ఆప్టే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.
సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన వారంతా సక్సెస్ అవుతారని అనుకోవడం అపోహ అని ఆమె కొట్టి పారేసింది.అంతేకాదు సినీ పరిశ్రమలో రాణించడానికి ఇన్సైడర్స్, ఔట్సైడర్స్ ఎవరైనా కష్టపడాల్సిందే.
ఇక అంచనాలను, బాధ్యతలను నిలబెట్టుకోవడానికి బయటివారితో పోలిస్తే వారసులు మరింత ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది అని ఆమె తెలిపారు.అన్ని రంగాల్లో బంధుప్రీతి ఉంటుందని, అందుకు సినీ పరిశ్రమ అతీతం కాదని ఆమె తెలిపింది.