రాధిక ఆప్టే సినిమాలపై అవగాహన ఉన్న ఎవరికైనా ఈ పేరు పరిచయం అక్కరలేదు అని చెప్పాలి.తనదైన నటనతో తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక మంచి నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
బాలీవుడ్ లో కూడా కొన్ని సిరీస్ లతో పాటు సినిమా లలో కూడా నటించిన ఈ భామ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే న్యూడ్ గా చేయడానికి కూడా ఏమాత్రం అడ్డుచెప్పదు కూడా.తెరపై బోల్డ్ క్యారెక్టర్సే కాదు తెర వెనక కూడా బోల్డ్ కామెంట్స్తో ఎప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటుంది రాధిక.
అయితే తాజాగా ఈ భామ బీఎఫ్ఎఫ్ షోలో తనకు వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.బీర్ తాగడం వల్ల తనకు ఒక చిత్ర అవకాశం కోల్పోయానని ఆ షో లో పేర్కొంది.
ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే…ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ‘విక్కీ డోనర్’.తొలుత ఈ చిత్రం కోసం రాధిక ఆప్టే ని హీరోయిన్ గా అనుకుని నిర్మాతలు సంప్రదించారట.
అయితే అప్పుడే ఆమె హాలిడే వెకేషన్ కోసం వెళ్లడం అక్కడ శుభ్రంగా తిని బీరు తాగడం తో బాగా లావైపోయిందట.
దానితో ఆ సినిమా అవకాశం ఇవ్వకుండా నిర్మాతలు తనను తప్పించినట్లు తెలిపింది.షూటింగ్ సమయానికి బరువు తగ్గుతాను అని చెప్పినా నిర్మాతలు వినిపించుకోలేదని,దానితో ఆ చిత్ర అవకాశం మిస్ అయినట్లు తెలిపింది.అయితే చిత్రం మిస్ అయినందుకు నాకు బాధలేదు కానీ,కేవలం బరువు పెరగడం వల్ల సినిమా ఛాన్స్ మిస్ అయ్యింది అన్న విషయమే నన్ను ఎక్కువగా బాధించింది అంటూ రాధిక తెలిపింది.
విక్కీ డోనర్ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా కు జోడీ గా యామీ గౌతమ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.