యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్.యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తుంది.
పూజా హెగ్డే ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.ఇక పీరియాడికల్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది.
మరో వారం, పది రోజుల్లో షూటింగ్ బ్యాలెన్స్ పూర్తయిపోయే అవకాశం ఉంది.మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రామాలు కూడా జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే ప్రభాస్ ఆది పురుష్ షూటింగ్ లో జాయిన్ అవుతాడు.ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీకి సంబందించిన డిజిటల్ రిలీజ్ రైట్స్ తాజాగా అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది.
ఇక ఈ మూవీకి సంబందించిన హిందీ రైట్స్ తప్ప మిగిలిన అని ప్రాంతీయ బాషలకి సంబందించిన రిలీజ్ హక్కులని జీ5 సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.జీ5 ఏకంగా 200 కోట్లు ఈ మూవీ హక్కుల కోసం చెల్లించడానికి ముందుకి వచ్చినట్లు సమాచారం.హిందీ డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్, నెట్ ఫ్లిక్స్ పోటీ పడుతున్నాయని బోగట్టా.ఇదిలా ఉంటే రాధేశ్యామ్ మూవీని థియేటర్స్ లో పాటు ఒటీటీలో ఒకేసారి రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో భారీగా డీల్ సెట్ అయ్యిందని టాక్.ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ ఎప్పుడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.సంక్రాంతి బరిలో దించుతారా లేదంటే అంతకంటే ముందుగానే వస్తారా అనే విషయంలో నిర్మాతలు ఆలోచనలో ఉన్నారని సమాచారం.