బడ్జెట్ లో సాహోని బీట్ చేస్తున్న రాధేశ్యామ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ లవ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

 Radheshyam Movie Budget Crossed 250 Crores, Tollywood, Director Radhakrishna, Uv-TeluguStop.com

యూవీ క్రియేషన్స్ పాన్ ఇండియా రేంజ్ లో ఈ దీనిని ఆవిష్కరిస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుపుకుంటుంది.

పారిస్ నేపధ్యంలో ఈ సినిమా కథ మొత్తం నడుస్తుంది.ఈ నేపధ్యంలో మెజారిటీ షూటింగ్ ఇటలీలో చేశారు.

ఇండియాలో షూటింగ్ చేసిన అది కేవలం గ్రీన్ మ్యాట్ లో ప్రత్యేకంగా వేసిన పారిస్ సిటీ సెట్ లోనే జరిగింది.ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి ముందు అనుకున్న బడ్జెట్ 150 కోట్లు మాత్రమే.సినిమా మొత్తం ఆ బడ్జెట్ లో పూర్తి చేయాలని నిర్మాతలు అనుకున్నారు.

అయితే ఉన్నపళంగా కరోనా ఎఫెక్ట్ తో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ రావడం షూటింగ్ లు ఏకంగా ఆరు నెలలు వాయిదా పడటంతో సినిమా కోసం వేసిన సెట్ ని అలాగే ఉంచాల్సి వచ్చింది.దాంతో అదనపు ఖర్చులు పెరిగిపోయాయి.

అలాగే సినిమాకి అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అయ్యింది.ఈ నేపధ్యంలో ప్రస్తుతానికి సినిమాకి పెట్టిన బడ్జెట్ 250 కోట్లు దాటిపోయినట్లు తెలుస్తుంది.సాహూ సినిమా కోసం యూవీ క్రియేషన్స్ అదే స్థాయిలో బడ్జెట్ పెట్టారు.సినిమా తెలుగులో డిజాస్టర్ కావడంతో మళ్ళీ ఆ డబ్బు తిరిగి రాబట్టుకోవడానికి ముప్పతిప్పలు పడాల్సి వచ్చింది.

సాహో సినిమా దెబ్బ తీసిన పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టింది.అయితే ఇప్పుడు లాక్ డౌన్ ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతూ ఉండటంతో థియేటర్స్ ఆక్యుపెన్సీ 50 శాతంకి తగ్గిపోయింది.

ఇది అలాగే కొనసాగే అవకాశం ఉంది.ఇలాంటి పరిస్థితిలో రాధేశ్యామ్ సినిమా పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబడుతుందా అనే టెన్షన్ లో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube