యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ ప్రేమకథా చిత్రం రాధేశ్యామ్.యూవీ క్రియేషన్స్ ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించింది.
పారిస్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం నడుస్తుంది.ఇందులో పూజా హెగ్డే ప్రభాస్ కి జోడీగా నటించింది.
ఇదిలా ఉంటే ఈ మూవీ మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.ఒక పది రోజులు షెడ్యూల్ మాత్రమే మిగలి ఉంది.
ఈ నేపధ్యంలో తాజాగా రాధేశ్యామ్ షూటింగ్ ని దర్శకుడు రాధాకృష్ణ ప్రారంభించాడు.ఈ షెడ్యూల్ పూర్తి కాగానే ఆది పురుష్ షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అవుతారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ మూవీపై దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేసాయి.
ఈ నేపధ్యంలో రాధేశ్యామ్ రిలీజ్ కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ మూవీని దసరాకి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఇప్పుడు ప్లాన్ చేస్తుంది.షూటింగ్ పెండింగ్ ఉండటం వలన ఇప్పట్లో రిలీజ్ చేసే అవకాశం లేదు.
ఈ నేపధ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని దసరా కానుకగా అందించాలని చూస్తున్నారు.దీనికి సంబంధించి ప్లాన్ కూడా రెడీ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ మూవీ అయిన వెంటనే అది పురుష్ షూటింగ్ లో జాయిన్ అవుతారు.అలాగే జులై నెలాఖరులో సలార్ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఈ రెండు సినిమాలు ఒకే సారి పూర్తి చేసి నాగ్ అశ్విన్ సినిమాని నవంబర్ లేదా డిసెంబర్ లో స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడు.