యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజాహెగ్డే రాధాకృష్ణ దర్శకత్వంలో గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువీ క్రియేషన్స్ బ్యానర్ల పై సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇందులో ప్రభాస్ విక్రమాదిత్యగా కనిపించగా పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో కనిపించనున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా జనవరి 14న విడుదల కావడంతో ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
తాజాగా పూజాహెగ్డే తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ప్రేరణ పాత్ర డబ్బింగ్ పూర్తి అయ్యిందని చిత్రబృందం ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ ఫోటోను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.వింటేజ్ బ్యాక్డ్రాప్ లో ఇటలీలో జరిగే ప్రేమకథగా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెరకెక్కించారు.
పూజాహెగ్డే ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ద్వారా ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ క్రమంలోనే రాదేశ్యామ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈమె నటించిన ఆచార్య సినిమా కూడా ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇలా వరుస సినిమాలతో బుట్ట బొమ్మ పూజాహెగ్డే ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు.