యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.ఈ సినిమా మొదలై చాలా నెలలవుతున్నా, ఇంకా రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో చిత్ర దర్శకనిర్మాతలు చాలా ఆలస్యం చేస్తుండటంతో అభిమానులు వారిపై మండిపడ్డారు.కాగా ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని రీసెంట్గా రాధేశ్యామ్ గ్లింప్స్ వరకు వరుసగా అప్డేట్స్ను రివీల్ చేస్తూ వచ్చింది రాధేశ్యామ్ చిత్ర యూనిట్.
అయితే ఇప్పుడు మరో ట్రీట్ ఇచ్చేందుకు రాధేశ్యామ్ టీమ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో కేవలం సౌత్ ప్రేక్షకులే కాకుండా నార్త్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాకు ఏకంగా ముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తుండటంతో ఈ సినిమా మ్యూజిక్ పరంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ చూస్తున్నారు.అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ను రిలీజ్ చేసి ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట.
దక్షిణాదిన జస్టిన్ ప్రభాకరన్, ఉత్తరాదిన మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న రాధేశ్యామ్ ఆల్బమ్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ట్రాక్ను త్వరలోనే రిలీజ్ చేసి ప్రేక్షకులకు ఈ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ప్రభాస్ వింటేజ్ లుక్తో నటిస్తున్న ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మరి రాధేశ్యామ్ ఈ ట్రీట్ను ఎప్పుడు ఇస్తారా అనేది చూడాలి.