యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇటీవల రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోన్న అందాల భామ పూజా హెగ్డే, ఈ సినిమాలో డ్యుయెల్ రోల్లో నటిస్తోందట.అందులో ఒక పాత్ర మ్యూజిక్ టీచర్గా ఉండనుందట.అయితే ఈ సినిమా పూర్వ జన్మకు సంబంధించిన కాన్సెప్ట్తో రాబోతున్నట్లు తెలుస్తోంది.ఇందులో పూజా హెగ్డే రెండు జన్మలు ఎత్తుతుందని, ప్రభాస్ ఆమెను ఎలా దక్కించుకుంటాడనేది సినిమా కథగా ఉండబోతుందట.
ఏదేమైనా ఈ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో తెగ హల్చల్ చేస్తోంది.బాలీవుడ్లో వచ్చిన ‘ఓం శాంతి ఓం’ చిత్ర తరహాలో ఈ సినిమాలో ప్రేమకథను డీల్ చేయనున్నాడట దర్శకుడు.
మొత్తానికి ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేందుకే ఇలాంటి కాన్సెప్ట్తో చిత్ర యూనిట్ రాబోతుందనే వార్త సినీ సర్కిల్స్లో వినిపిస్తోంది.మరి ఈ వార్తల్లో ఎలాంటి నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.