యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను పూర్తి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్లో మనకు కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ పూర్తిగా ఎంటర్టైన్ అవుతారని, ఈ సినిమాతో ఫ్యాన్స్ సంతృప్తి పొందడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమా ఔట్పుట్పై దర్శకుడు రాధాకృష్ణ తాజాగా ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.
రాధేశ్యామ్ చిత్రంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవడం ఖాయమని, ఈ సినిమా ఖచ్చితంగా వారికి నచ్చుతుందని, ఈ సినిమా విషయంలో వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దర్శకుడు రాధాకృష్ణ తెలిపాడు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ అదిరిపోయే సర్ప్రైజ్లు ఇవ్వడం ఖాయమని ఆయన అన్నాడు.
ఈ సినిమాలో ప్రభాస్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతారని ఆయన అన్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాధాకృష్ణ తెలిపారు.
ఇప్పటికే టీజర్కు మెరుగులు దిద్దుతున్నామని, త్వరలోనే ఈ టీజర్ను రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు.ఈ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోతుందని, వారి లవ్స్టోరి ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే హిట్ అందుకోవడం పక్కా అంటున్నారు ఆయన ఫ్యాన్స్.మరి రాధేశ్యామ్ చిత్రంతో ప్రభాస్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి.