యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే.అందుకే ఈయన సినిమాలకు భారీ డిమాండ్ నెలకొంది.
ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు జేబులు నింపుకుంటున్నారు.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో రాధే శ్యామ్ ఒకటి.
ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటుంది.మధ్యలో కరోనా కారణంగా వాయిదా పడడంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది.
ఈ సినిమా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.యువీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.అయితే ఈ సినిమా బిజినెస్ మాత్రం ఎవ్వరు ఊహించని విధంగా ఒక రేంజ్ లో జరుగుతుంది.
ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులు అమ్ముడు పోయాయి.హిందీ భాష మినహా మిగతా భాషలు హక్కులను జీ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది.ఇక హిందీ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు టాక్ వినిపిస్తుంది.ఇది ఇలా ఉంటే ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ఇప్పుడు భారీ ధరకు క్లోజ్ అయిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.
ఆ ధర చూసి అందరు ఆశ్చర్య పోతున్నారు.రాధే శ్యామ్ నాన్ థియేట్రికల్ హక్కులను ఏకంగా 250 కోట్లకి అమ్ముడు పోయినట్టు వార్తలు వస్తున్నాయి.ఈ డీల్ చుస్తే అందరి మతులు పోతున్నాయి.అంత భారీ ధరలకు అమ్ముడు పోవడంతో ప్రభాస్ స్టార్ డమ్ ఏ రేంజ్ లో ఉందొ తెలుస్తుంది.ప్రభాస్ ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాను చేస్తున్నాడు.